Friday, August 5, 2011

పిచ్చి కవిత

మనిషి మనిషిలో మానవతత్వం...
మనసు మనసు లో కరుణా భావం...
నిజాయితీనే నమ్మిన లోకం...
లంచం అడగని ప్రభుత్వ రంగం...
పదవులు కోరని పెద్ద మనుషులు...
మమతను వీడని మంచి మనసులు...
పది నిమిషాల్లో నే రాసిన వైనం,,,
పది యుగాలకైనా కనిపిస్తుందా...
రాని మార్పును రాసిన నేను ,,,
రాదని తెలిసే రచియించాను....
ఈ తోచని మనసు తోచినట్టుగా,,,
రాసిన రాతలు "పిచ్చి కవితలే"....

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home